01 January 2026

షిర్డీ సాయిబాబాపై ద్వేష మేల?

ఈమధ్య షిర్డీ సాయిబాబాపై కొందరు హిందూ సనాతనవాదులు అని చెప్పుకునేవారు విపరీతంగా దాడి చేస్తున్నారు. సాయిబాబా హిందువు కాదు .. ముస్లిం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. 

దేవుడు ఒక్కడే (sabkaa Maalik Ek Hai) అన్న సాయిబాబాకు మతం రంగు పులిమి భక్తుల మనోభావాలను డెబ్బ తీస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉంది అని అర్ధం అవుతుంది. 

దేశంలో హిందూ మతోన్మాదవాదులు  "సనాతన ధర్మం" పేరుతొ పెరిగిపోతున్నారు. 

ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు వచ్చిన హిందూ ధర్మం యుగయుగాలుగా చెక్కు చెదరలేదు. దీనిపై విదేశీయులు కూడా మక్కువ పెంచుకునేవారు. అలాటింది ఈ హిందూ ఉగ్ర తాండవవాదుల ప్రవర్తనతో హిందూ ధర్మం విదేశాల్లో కూడా చులకన ఐపోయే రోజులు వస్తున్నాయి.

హిందువులపై దాడులు జరిగితే ప్రతిదాడి.. పరమత విద్వేషాలు... పెచ్చరిల్లుతున్నాయి.

పరమత సహనం నేర్పిన మనకు మతోన్మాదం అలవాటు చేస్తున్నాయి. 

దీనిలో భాగమే షిర్డీసాయి పై ఈ అవాకులూ . చెవాకులూ.. దీనికి మీడియా కూడా సహకరిస్తూ రోజంతా చర్చలు పెడుతోంది. 

ఇలాగే జరిగితే షిర్డీసాయి భక్తులపై దాడులు జరిగే అవకాశం ఉంది.  

Related Posts Plugin for WordPress, Blogger...