22 June 2025

"శోధిని" లో ఇటీవలి మార్పులు ...

 1. అనామక కామెంట్లు హోమ్ పేజీ నుండి కనపడవు . 

వాటిని విడిగా ఇక్కడి నుంచి  

లేదా ఇటీవలి ప్రముఖ వ్యాఖ్యాతలు లో    చూడవచ్చు 

 2.లింకులతో కూడిన కామెంట్లు శోధిని లో కనపడవు 

 శోధినిలోఇతర మార్పులు

పోస్టు లో పెట్టిన బొమ్మ ఒకటి కనపడుతుంది (తెలుగు హోమ్ పేజీ లోతప్ప మిగతా అన్ని విభాగాల్లో)                  

 

       

8 comments:

శ్యామలీయం said...

మంచి మార్పులు!

మరి కొన్ని మార్పులు వీలైతే పరిశీలించండి
1. ఒక టపాకు సంబంధించి పరిమిత సంఖ్యలోనే వ్యాఖ్యలు చూపటం.
2. ఒక వ్యాఖ్యాత నుండి పరిమితసంఖ్యలోనే వ్యాఖ్యలు చూపటం.
3.పునరుక్తి వ్యాఖ్యలను పరిహరింఛటం.

శ్యామలీయం said...

మరొకటి.
4. చేట భారతం వ్యాఖ్యలను గురించి. వ్యాఖ్య ప్రదర్శనకు నిడివి పరిమితి విధించటం.

srinivasrjy said...

శ్యామలీయం గారూ,

నమస్తే .. మీరు చెప్పిన మార్పులు పరిశీలిస్తాను.

3వ పాయింట్ అర్ధం కాలేదు!!

ఇంకో విషయం మీ బ్లాగు "శ్యామలీయం" వీక్షకులకు అందుబాటులో లేని కారణంగా శోధిని నుండి తొలగించబడింది..

శ్యామలీయం said...

కొందరు ఒక వ్యాఖ్యనే వంద చోట్ల అతికిస్తూ ఉంటారు. అవి వ్యాఖ్యలు పేజీని ఆక్రమించి వేస్తాయి. అందుచేత ఒక వ్యాఖ్య కాపీని మాత్రమే ప్రచురించితే చాలును.

శ్యామలీయం said...

శ్యామలీయం బ్లాగు ప్రస్తుతం ప్రైవేటు బ్లాగు. వీలు వెంబడి పబ్లిక్ చేయాలి. కొన్ని కారణాలవలన నాజీవితం అల్లకల్లోలంగా ఉంది. అందుకని కొన్ని వ్యాసంగాలు కష్టంగా ఉన్నాయి.

sarma said...

ఆగ్రిగేటర్ లో మార్పులు చేర్పులు కూర్పులు సూవించగల సమర్థుడను కాను, కాని ఒక మాట చెప్పాలనిపించింది. మార్పులను ఆహ్వానిస్తాను,మంచికోసమేనని అనుకుంటాను. ఫలితం కాలమే నిర్ణయిస్తుంది. ఏమైనా వ్యాఖ్య చేసేవారికి కొంచమైనా ఇంగితం ఉంటే ఈ సమస్యలే రావు కదా! 🤣

ఎంతచదువు చదివి ఎన్ని నేర్చినగాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు?
విశ్వదాభిరామ వినుర వేమ!

srinivasrjy said...

@sarma

సార్ .. తెలుగు బ్లాగులు మళ్ళీ పుంజుకుంటాయి అనేది అసాధ్యం ..
ఇప్పుడు ఆగ్రిగేటర్ లో క్రొత్తగా మార్పులు చేసినా మనలాంటి వారి సౌలభ్యం కోసం మాత్రమే!
ఏదో గడిచినంత కాలం ముందుకు తీసుకు వెళదాం అనే తపనే తప్పితే .. ఏం చేసినా "వృధా ప్రయాస"

శ్యామలీయం said...

ఒకసారి ఆలోచించండి. బ్లాగు టపాల లోని విషయాలమీద జరిగిన చర్చల కన్నా టపాకు ఏమాత్రం సంబంధం లేని విషయాలను లాగి నిందాలాపాలతో ఆవేశకావేషాలతో రంకెలు వేస్తూ చేసిన వ్యర్ధ చర్చలే తొంభైశాతం ఉంటే ఆ చర్చల వలన బ్లాగులకు ఏమి ప్రయోజనం? చదువరులకు ఏమి ప్రయోజనం? కేవలం పనిలేని కాలక్షేపం రాయుళ్ళ వలన బ్లాగు లోకం చెడింది! ఇక్కడ బ్లాగర్ల బాధ్యతా రాహిత్యం కూడా మిక్కుటంగా ఉంది. వాళ్ళూ మోడరేషన్ చేసి చెత్త వ్యాఖ్యలను నిరాకరించకపోవటం ఈదరిద్రానికి ముఖ్య కారణం. ఇప్పుడు ఎంతవగచీ ఏమీ లాభం లేదు కదా. చెత్త బ్లాగులూ చెత్త వ్యాఖ్యలు రాజ్యం చేసే చోట పాఠకులు ఆ చెత్త కోసం రారండి.

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...